మే , 2008ను భద్రపఱచు

ఆహా ఏమి రుచి…

Posted in సమీక్ష on మే 21, 2008 by రాజేష్
ఈరోజు బాక్స్ పట్టుకు రాలేదు. subway కానీ, sandwich కానీ లంచ్ కి తిందాము అనుకున్నా. పన్నెండో గంట కొట్టగానే, బయటకి వచ్చా. చిన్న చినుకుతో వర్షం పడుతోంది. రోజూ ముందుగా కనపడే తోపుడు బండివాడు కనపడ్డాడు. ఆ బండి ముందు కనీసం పదిహేను మంది అనుకుంటా ఉన్నారు. రోజూ అంతే. చాలా busy గా ఉంటుంది వాడి బండి దగ్గర. నాకు ఈరోజే తెలిసింది వాడు శాఖాహారం కూడా అమ్ముతాడని. సరే ఎలా ఉంటుందో చూద్దాం అని, వెళ్ళి లైన్ లో నుంచున్నా. పావుగంటలో నా వరకూ వచ్చింది. Menu లో మొత్తం మీద మూడో నాలుగు రకాలు ఉన్నాయి. చికెన్ రైస్, చికెన్ sandwich, దాల్ (పప్పు) రైస్ లు main items. నేను దాల్ రైస్ అని చెప్పాను. Salad కావాలా అని అడిగాడు. OK అన్నాను. అప్పుడు చూసాను. వాడి బండి చిన్నదే అయినా, నాలుగు గిన్నెలలో ఉడికిన అన్నం ఉంది. ఒక పెనం మీద చికెన్ వేడెక్కుతోంది. ఒక డబ్బాలో తరిగిన cabbage, carrot, tomato ముక్కలు ఉన్నాయి. వాడికి
ఇంకొక మనిషి orders ని pack చెయ్యడానికి సహాయం చేస్తున్నాడు. దాల్ రైస్ ఒక డబ్బాలో వేసి, పక్కనే పాలకూరతో చేసిన కూరా, salad వేసి ఇచ్చాడు. మొత్తం 5$. ఆఫీస్ కి తెచ్చుకుని తిన్నాను. చాలా రుచిగా ఉంది. న్యూయార్క్ లో, Roadside బండిలో, ఇంత మంచి శాఖాహార భోజనం దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. మామూలుగా అంత పట్టించుకో పోయినా, “street vendors in New York” అని Google లో వెతికాను. Manhattan లో
ఎక్కడో ఒక తమిళుడు, చాలా మంచి దోశలు వేస్తాడుట. అతని పేరు తిరు ’దోశ’ కుమార్. [2007 vendy awards] వాడి దగ్గర చాలా మంది తింటూ ఉంటారుట. ఏటా జరిగే పాటీలలో వాడికి మొదటి బహుమతి కూడా వచ్చిందిటా. ఈసారి ఆ చుట్టు పక్కల ఉంటే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను.

చాన్నాళ్ళకి మళ్ళీ…

Posted in అవీ ఇవీ on మే 19, 2008 by రాజేష్
ఒక నగరం నుంచి మరో మహానగరానికి….
రోజూ రెండు నిమిషముల నడక నుంచి గంటన్నర రైలు ప్రయాణానికి….
మధ్యాన్న భోజనం, కంచం నుంచి లంచ్ డబ్బాకి….

ఈ మార్పులన్నీ వచ్చాయి న్యూయార్క్ కి సంసారాన్ని మార్చాక. కానీ ఈ మార్పు వల్ల రైలులో దొరికే నలభై నిమిషాలని పుస్తక పఠనానికి ఉపయోగించాలని ముందే నిర్ణయించుకున్నందున, కాలక్షేపం బాగానే అవుతోంది. ఒక english పుస్తకము, మూడు తెలుగువి చదివాను. అందులో చెప్పుకో దగ్గవి, ఒకటి శ్రీరమణగారు రాసిన కధలు, రెండు మొక్కపాటి నరసింహశస్త్రి గారి బారిష్టరు పార్వతీశం. ప్రస్తుతానికి చదువు తున్నది, అమెరికా తెలుగు కధానిక అనే తెలుగు కధల సంగ్రహము. ఇందులో సంపాదకులు డా!! పెమ్మరాజు వేణుగోపాల రావు గారు రాసిన కధానిక తత్వ విచారణ, చాలా వివరంగా ఉంది. ఇందులో
కధలకీ నవలలకీ తేడాలు, కధా నిర్మాణం, కధాదృక్పధం గురించి చక్కగా వివరించారు.