రోజూ రెండు నిమిషముల నడక నుంచి గంటన్నర రైలు ప్రయాణానికి….
మధ్యాన్న భోజనం, కంచం నుంచి లంచ్ డబ్బాకి….
ఈ మార్పులన్నీ వచ్చాయి న్యూయార్క్ కి సంసారాన్ని మార్చాక. కానీ ఈ మార్పు వల్ల రైలులో దొరికే నలభై నిమిషాలని పుస్తక పఠనానికి ఉపయోగించాలని ముందే నిర్ణయించుకున్నందున, కాలక్షేపం బాగానే అవుతోంది. ఒక english పుస్తకము, మూడు తెలుగువి చదివాను. అందులో చెప్పుకో దగ్గవి, ఒకటి శ్రీరమణగారు రాసిన కధలు, రెండు మొక్కపాటి నరసింహశస్త్రి గారి బారిష్టరు పార్వతీశం. ప్రస్తుతానికి చదువు తున్నది, అమెరికా తెలుగు కధానిక అనే తెలుగు కధల సంగ్రహము. ఇందులో సంపాదకులు డా!! పెమ్మరాజు వేణుగోపాల రావు గారు రాసిన కధానిక తత్వ విచారణ, చాలా వివరంగా ఉంది. ఇందులో
కధలకీ నవలలకీ తేడాలు, కధా నిర్మాణం, కధాదృక్పధం గురించి చక్కగా వివరించారు.
